MP Raghunandan Rao: నువ్వు కాదు ఆ మాట మీ అయ్యతో చెప్పించు.. కవితపై రఘునందన్ సంచలనం!

బీఆర్‌ఎస్ ను బీజేపీలో కలుపుతారంటున్న కవిత బీజేపీతో చర్చలు జరిగినట్లు మీ నాయనను బయటకు వచ్చి చెప్పమనంటూ బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘుందనరావు సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదన్నారు.

New Update
Raghunandan Rao On TTD

MP Raghunandan Rao

MP Raghunandan Rao: బీఆర్‌ఎస్ ను బీజేపీలో కలుపుతారంటున్న(BRS Merged into BJP) కవిత(MLC Kavitha) బీజేపీతో చర్చలు జరిగినట్లు మీ నాయన, మీ నాయకుడు కేసీఆర్‌(KCR)ను బయటకు వచ్చి చెప్పమను అంటూ బీజేపీ నేత, మెదక్‌ ఎంపీ రఘుందనరావు(MP Raghunandan Rao) సవాల్‌ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో మీ ఆస్తులు పెంచుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని ఎద్దేవా చేశారు. కవిత ఐదేళ్ల అభివృద్ధిని చూసే నిజామాబాద్ ప్రజలు ఆమెను ఓడించారన్నారు. కవిత సెల్ఫ్ బ్రాండింగ్ కొరకే బతుకమ్మ ఆడింది కానీ తెలంగాణ కొరకు ఏం కొట్లాడింది ఏం లేదని స్పష్టం చేశారు. బతుకమ్మ మన సంప్రదాయం అన్న ఆయన కవిత వచ్చాకే బతుకమ్క ఆడలేదని గుర్తించాలన్నారు. 

Also Read: 2014- 2023 గద్దర్ అవార్డ్స్.. ఉత్తమ చిత్రాలుగా RRR, అఖండ, జెర్సీ, కలర్ ఫొటో

మీడియాలో స్పేస్ కొరకే కవిత నాటకాలు ఆడుతుందన్న రఘునందన్‌ రావు ఆమెను ఆమె బ్రాండింగ్ చేసుకోడానికి మాట్లాడుతుందన్నారు. ఒక్క అమరుడి కుటుంబాన్ని అయిన కవిత పరామర్శించిందా అని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉన్న పదేళ్లు ఉద్యమకారులకు మీరు చేసింది ఏంటి? అని రఘునందన్‌ రావు ప్రశ్నించారు.  

Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

వాళ్లను వెంటనే జైలులో వేయాలి: MP Raghunandan Rao

ఇక తనపై వ్యక్తిగతంగా బురద చల్లుతున్నారన్న రఘునందన్ రావు తనపై పెయిడ్‌ ఆర్టికల్స్‌ రాయిస్తున్నారని ఆరోపించారు. దొంగలకు జీతాలు ఇచ్చి నా వ్యక్తిత్వ అహనానికి పాల్పడుతున్నారన్నారు.నిన్న సాక్ష్యాత్తు కవితే  ఇతర దేశాల్లో పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పిందని గుర్తుచేశారు. వారందరినీ వెంటనే జైలు లో వేయాలని cm రేవంత్ ను కోరుతున్నానని రఘునందన్‌ రావు అన్నారు. కవిత వరకు వస్తే కానీ కడుపు నొప్పి తెలియలేదా? అని తీవ్రంగా ప్రశ్నించారు. తెలంగాణ లో బీఆర్‌ఎస్‌ ఎక్కడ ఉందన్న రఘునందన్‌ రావు కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత  చెల్లని రూపాయలుగా మారారని విమర్శించారు.

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోందని.. ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. రాష్ట్రంలో పొత్తులు పెట్టుకొని గెలిచే పార్టీ బీఆర్ఎస్సే అన్నారు. 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించారు. పొత్తులు విలీనాలపై తమ పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడానికి చేసే ప్రయత్నం అని మండిపడ్డారు. చిట్‌చాట్‌లు చేయడం కాదు.. కవితకు దమ్ము ఉంటే నేరుగా వచ్చి మాట్లాడాలని రఘునందన్ రావు హితవు పలికారు.

Also Read :  MI vs GT: ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్.. గుజరాత్‌ కొట్టగలదా ?

Advertisment
Advertisment
తాజా కథనాలు