KTR : సిరిసిల్లలో ఉద్రిక్తత..కేటీఆర్ క్యాంపు ఆపీస్ ముట్టడించిన కాంగ్రెస్

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు. దీన్ని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది.

New Update
Congress besieges KTR's camp office

Congress besieges KTR's camp office

 KTR : సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌  క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్‌ రెడ్డి ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నించారు, దీన్ని బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో సీఎం రేవంత్‌ రెడ్డి పోటో పగిలిపోయింది. దీంతో కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. బీఆర్‌ఎస్‌ నేతలపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.కాగా క్యాంపు ఆఫీసులో సీఎం పోటో పెట్టాలని బీఆర్‌ఎస్‌ నేతలు  ప్రొటోకాల్‌ పాటించాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌‌ చేశారు.  

Also Read :  ఆపరేషన్ సిందూర్ తర్వాత టర్కీ-పాక్‌ భేటీ.. థాంక్స్‌ చెప్పిన షెహబాజ్ షరీఫ్

మరోవైపు సిరిసిల్లలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో కేటీఆర్ ఫొటో లేకపోవడాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు అధికారులను నిలదీశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.  దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం  ఫొటో పెట్టాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలోని ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించారు. 

ఇది కూడా చదవండి: ఏసీ గది నుంచి నేరుగా ఎండలోకి వెళ్తున్నరా..? అయితే మీ ఆరోగ్యానికి..!!

ప్రోటోకాల్ పాటించాలని అడిగితే క్యాంపు కార్యాలయంపైకి దాడికి వస్తారా అంటూ బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. ఒక దశలో రెండు పార్టీల నేతలు తోచుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పోలీసుల లాఠీచార్జిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జంగం చక్రపాణితోపాటు పలువురు నాయకులు గాయపడ్డారు. ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయమైంది. బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ క్యాంపు కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించీ రాస్తారోకో చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ నేతలను తంగలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ప్రస్తుతం కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: బరువు తగ్గడానికి 8 రహస్యాలు..ఆశ్చర్య పరిచే అలవాట్లు

Also Read :  దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు