Vemulawada : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు. తిప్పాపూర్ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి. దీంతో ఇప్పటివరకు మృతిచెందిన కోడెల సంఖ్య 20కి చేరింది. వాటిని గుట్టుచప్పుడు కాకుండా మూలవాగులో గోశాల సిబ్బంది ఖననం చేశారు.