TGSRTC: టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్‌...ఆ రోజు నుంచి బస్సులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీసీజేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న తెలిపారు.

New Update
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..

TGSRTC

TGSRTC:  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్‌ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొంతకాలంగా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికసంఘాలు ఆరోపిస్తున్నాయి. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్దమయ్యారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న స్పష్టం చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వంలో విలీనం, కార్మికుల సమస్యల పరిష్కారం, కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలు తదితర డిమాండ్లతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమ్మెకు సిద్ధమైనట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌కు గాయం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్షన్‌
 
 సమ్మెకు సంబంధించిన వివరణను కార్మిక నేతలు లేబర్‌ కమిషనర్‌ ఆఫీసులో అధికారులకు మరోసారి అందజేశారు. హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు రౌండ్‌టేబు ల్‌ సమావేశం నిర్వహించి, సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. మే 1న అన్ని డిపోల్లో మేడే జెండాను ఎగురవేసి, మే 5న కార్మిక కవాతు నిర్వహించి, 7నుంచి సమ్మెకు సన్నద్ధం కావాలని కార్మికులకు జేఏసీ పిలుపునిచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

మే 5న ఆర్టీసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసి యూనిఫారంలో కార్మికులంతా కవాతులో పాల్గొంటారన్నారు. అయితే కొన్ని ఆర్టీసీ కార్మికుల సంఘాలు జేఏసీలోకి వస్తామని చెప్పి.. మళ్లీ యాజమాన్యానికి మద్దతుగా తమతో కలవడం లేదన్నారు. యూనియన్‌లకు అతీతంగా అందరు సమ్మెకు కలిసి రావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న పిలుపు నిచ్చారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ వేగవంతం చేయాలంటూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ
 
ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలన్నారు. 2021 వేతన సవరణ చేయాలని.. అలాగే పెండింగ్ బకాయిలను సైతం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసి కార్మికులకు ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ సంస్థలో 16 వేల మంది రిటైరయ్యారని.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే 7వ తేదీ నుంచి సమ్మె జరుగుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసి ఉద్యోగులకిచ్చిన హామీల సమస్యల పరిష్కారం కోసం ముందుకు వచ్చి ఈ సమ్మెను నివారించే ప్రయత్నం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ సంస్థలో పారిశ్రామిక అశాంతి కలగకుండా చూడాలని జేఏసీ కోరుతోందన్నారు.

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు