Telangana: సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా వారికి శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.

New Update
telangana elections

telangana elections

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేసే ఆశావాహులు ప్రచారాన్ని అప్పుడే మొదలు కూడా పెట్టేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: Kshama Sawanth: ఇండో అమెరికన్ నాయకురాలు క్షమా సావంత్‌కు భారత్ వీసా తిరస్కరణ

ఈనెల 15 లోగా శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో ఎంపిక చేసిన అధికారులకు మాస్టర్‌ ట్రైనర్ల శిక్షణ పూర్తయింది. వారితో అన్ని జిల్లాల్లోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి.. ఈనెల 12లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్‌ అధికారులకు ఈనెల 15లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. 

Also Read: Jeeth Adani: గుజరాతీ సంప్రదాయంలో వేడుకగా గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడి వివాహం!

ముసాయిదా కేంద్రాలను..

మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని జిల్లాల్లో పోలింగ్‌ కేంద్రాల ఎంపిక ప్రక్రియ కూడా ఈనెల 15లోగానే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మరో ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాలను గుర్తించారు. తాజాగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.'ఈ నెల 11న ముసాయిదా కేంద్రాలను గుర్తించాలి. అదే రోజు వాటి జాబితాను ఆయా మండల పరిషత్‌ల పరిధిలో ప్రదర్శించాలి. 

అందులో ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 13 వరకు స్వీకరించి, 14న పరిష్కరించాలి. అదేరోజు జిల్లా కలెక్టర్లకు తుది ఎంపిక జాబితాను ఇవ్వాలి. ఫిబ్రవరి 15న ఆ మండలాల పరిధిలో వాటిని ప్రదర్శించాలి' అని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు తయారు చేశారు. తాజాగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల కోసం విడిగా మరొక జాబితాను రెడీ  చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ నెల 10లోగా ముసాయిదా సిద్ధం చేయాలని ఆదేశించింది.ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీల సింబల్స్‌పై శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో జాతీయ పార్టీలు కాంగ్రెస్, సీపీఎం, ఆమ్‌ఆద్మీలు, బీజేపీ, ప్రాంతీయ పార్టీలు బీఆర్ఎస్, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్, ఎంఐఎం, టీడీపీ, వైసీపీ, సీపీఐ, జనసేనలకు రిజిస్టరై ఉన్న గుర్తులను విడుదల చేసింది. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయింపుల కోసం 37 ఫ్రీ సింబల్‌లతో కూడిన జాబితాను విడుదల చేసింది. 

కాగా, ఈనెల చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Also Read: Trump-America: అమెరికాలోని భారతీయులకు బిగ్ రిలీఫ్.. ఆ ఉత్తర్వులను కొట్టిపారేసిన కోర్టు

Also Read: Delhi Assembly Results: ఢిల్లీ పీఠం ఎక్కేదెవరు..నేడే అసెంబ్లీ ఫలితాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు