/rtv/media/media_files/2025/05/04/PnjYyJRfn1425sgaJ9A8.jpg)
High Court orders GHMC
High Court : అక్రమ నిర్మాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జీహెచ్ఎంసీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోని అనధికార నిర్మాణాలను తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు, అక్రమంగా నిర్మించిన అన్ని అంతస్తులను వెంటనే సీల్ చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది.హైదరాబా ద్ షేక్పేటలో ఓయూ కాలనీలో ఒక వ్యక్తి జీ ప్లస్ 2 అనుమతులు తీసుకుని 3, 4, 5 అంతస్తులు, ఆపైన పెంట్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారంటూ అందిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జి.రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి విచారణ చేపట్టి జీహెచ్ఎంసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
షోకాజ్ నోటీసు జారీ చేసిన వెంటనే జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 461ఎ కింద ఎందుకు సీజ్ చేయడంలేదో అర్థం కావడంలేదన్నారు. నోటీసు జారీ చేసిన తరువాత చట్టం పట్ల ఏ మాత్రం భయం లేకుండా, కూల్చివేతలపై ఎలాంటి ఆందోళన లేకుండా నిర్మాణానాలను కొనసాగిస్తున్నారన్నారు. ఇందులో యజమానులు/బిల్డర్లు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల మధ్య సంబంధం లేదని చెప్పలేమన్నారు. ఇకపై అనధికారిక నిర్మాణాలు జరిగినట్లు గుర్తించిన వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేయడంతోపాటు అక్రమ నిర్మాణాలకు తక్షణం సీల్ చేయాలని ఆదేశించారు. అనధికారిక నిర్మాణాలను అడ్డుకోవడానికి షోకాజ్ నోటీసులు జారీ, తరువాత కూల్చివేతకు ఉత్తర్వులు జారీ చేయడం, ఈ మధ్య కాలంలో నిర్మాణాలు కొనసాగించడానికి అనుమతించడం వంటివన్నీ అసంబద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్స్, టౌన్ప్లానింగ్ అధికారులకు తగిన సూచనలు జారీచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశించింది.అనుమతులు లేకుండా, ప్రణాళికకు విరుద్ధంగా చేపట్టిన భవనాలను, అంతస్తులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి సీజ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్లనే హైకోర్టులో ఎక్కవ సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయని పేర్కొంది.
Also Read: నాకు ఒక్క అవకాశం ఇస్తే.. పహల్గాం టెర్రర్ అటాక్పై కేఎ పాల్ సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు ఏప్రిల్ 29న జారీ చేసిన ఆదేశం తర్వాత మే 1న GHMC ఈ సర్క్యులర్ను వేగంగా అమలు చేసింది. అన్ని జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సర్కిల్ మరియు వార్డ్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ఈ సర్క్యులర్ పంపింది, షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత, ఏదైనా అనధికార అంతస్తులు లేదా మంజూరైన ప్లాన్లకు భిన్నంగా చేసిన నిర్మాణాలను సీల్ చేయాలని ఆదేశించింది.GHMC పదే పదే షోకాజ్ నోటీసులు జారీ చేయడం పట్ల జస్టిస్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. "నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా అనధికార నిర్మాణాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు లేదా ఉద్దేశపూర్వకంగా చర్యను ఆలస్యం చేస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
చాలా సందర్భాలలో, పునాది దశలో ఫిర్యాదులు జరుగుతాయని, కానీ అధికారులు చర్య తీసుకోవడానికి మూడు లేదా నాలుగు అంతస్తులు నిర్మించే వరకు వేచి ఉంటారని కోర్టు గమనించింది. షోకాజ్ నోటీసులకు సమాధానాల కోసం వేచి ఉండటం, నిర్మాణాన్ని ఆపకుండా లేదా ప్రాంగణాన్ని మూసివేయకుండా ఉండడం వల్ల నిర్మాణాలు సాగుతున్నాయన్నారు."యాంత్రికంగా నోటీసులు జారీ చేయడం, నిర్మాణాన్ని కొనసాగించడానికి అనుమతించే ఈ పద్ధతికి ముగింపు పలకాలి. GHMC సకాలంలో చర్య తీసుకోకపోతే, అది కోర్టు ధిక్కారానికి దారితీయవచ్చు" అని జస్టిస్ రెడ్డి హెచ్చరించారు. విచారణలు పెండింగ్లో ఉన్నప్పటికీ, అనధికార అంతస్తులను ప్రారంభ దశలోనే కూల్చివేయడమనేది హైదరాబాద్ అంతటా ప్రబలంగా ఉన్న అక్రమ నిర్మాణాల సంస్కృతికి వ్యతిరేకంగా సమర్థవంతమైన పనిచేసినట్లవుతుందని ఆయన నొక్కి చెప్పారు .
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!