TG CRIME : కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు

మహారాష్ట్రలోని నాందేడ్‌ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది.

New Update
Road accident

Road accident

TG CRIME : మహారాష్ట్రలోని నాందేడ్‌ కు చెందిన పెళ్లిబృందానికి జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, వరుడితో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. వివరాల ప్రకారం నాందేడ్‌కు చెందిన యువకునికి కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.

Also Read: ఈ సాలా కప్ నమ్దే..18 ఏళ్ళ కల... బెంగళూరు రాయల్ విన్నింగ్

ఈ క్రమంలో బుధవారం రాత్రి పెళ్లి బృందం నాందేడ్‌ నుంచి హుజురాబాద్‌ బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న కారును జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర మరణించగా పెళ్లికుమారుడితో పాటు ఆరుగురికి గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read: కెప్టెన్ మారాడు కథ మారింది..

కాగా ప్రమాదంలో వరుడు గాయపడటంతో వివాహం ఆగిపోయింది. మరోవైపు చిన్నారి మృతితో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఘనంగా జరగాల్సిన పెళ్లి వాయిదా పడటంతో పెళ్లికి వచ్చిన బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. 

Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

Advertisment
Advertisment
తాజా కథనాలు