TG Crime : జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం.. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి, ఏడుగురికి గాయాలు
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన ఒక దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.