Delhi: కవిత, కేజ్రీవాల్ ఉన్న జైలులో కొట్టుకున్న ఖైదీలు
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవిత, సీఎం కేజ్రీవాల్ ఉన్న తీహార్ జైలులో నిన్న ఇద్దరు ఖైదీలు కొట్టుకున్నారు. జైలు నంబర్ 8, 9లో ఖైదీల మధ్య గొడవ జరిగిందని జైలు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.