/rtv/media/media_files/Pco8xPWYwOypFyD2tDTd.jpg)
కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ను విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ఆయన మనసంతా విషం నింపుకొని వరంగల్ సభలో మాట్లాడారని మంత్రి ఆరోపించారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ విలనా అని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా పుట్టి, ప్రాంతీయ పార్టీ మారి, జాతీయ పార్టీగా మార్చుకున్నారని ఆయన ఎద్దేశా చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read: KCR ఎమోషనల్ : ఇవన్నీ.. చూస్తుంటే నాకు భాదేస్తోంది
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
Ponguleti Says About KCR
Also read: KCR: పోలీసులకు KCR మాస్ వార్నింగ్.. ఈరోజు డైరీలో రాసిపెట్టుకోవాలి
కేసీఆర్ వల్ల ధనిక రాష్ట్రం.. అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రి పొంగులేని శ్రీనివాస్ అన్నారు. 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో కేసీఆర్ మంచి సూచనలు ఇస్తాడేమో అనుకున్నామన్నారు. రైతులు వరి వేస్తే ఉరే అని తన ఫామ్ హౌస్లో 100 ఎకరాల్లో వరి పండిచుకున్నాడని ఆయన అన్నాడు. 10ఏళ్లలో మీరు చేసిన ఘనకార్యాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమా అని పొంగులేటి సవాల్ విసిరారు. సీఎంగా ఉన్నప్పుడు ఏనాడు కేసీఆర్ సెక్రటేరియ్కు రాలేదని అన్నారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
(telanagana | ponguleti | minister-ponguleti | ex mp ponguleti srinivas reddy | latest-telugu-news)