/rtv/media/media_files/2025/05/13/FmBJbqhMqivWs5MeyvYZ.jpg)
man dies after mutton piece stuck in throat in nizamabad
మటన్ రూపంలో వచ్చిన మృత్యువు ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. అప్పటి వరకు సరదాగా గడిపిన ఆ వ్యక్తి కొద్ది సమయంలోనే మృత్యు ఒడికి చేరుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
గొంతులో ఇరుక్కుని మృతి
నిజమాబాద్ జిల్లా కోటగిన మండలం సుద్దులం తండాలో ఇటీవల జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. దీంతో తండా వాసులంతా తమ తమ ఇళ్లలో చికెన్, మటన్, ఫిష్లతో గుమగుమలాడే విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో తండాకు చెందిన ఫకీరా అనే వ్యక్తికి కొందరు స్నేహితులు ఉన్నారు.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?
వారిని ఫకీరా తమ ఇంటికి విందుకు పిలిచాడు. దీంతో కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పస్పల్లి తండాకు చెందిన తారాసింగ్.. ఫకీరా ఇంటికి విందుకోసం వచ్చాడు. అందరూ కలిసి ఒక దగ్గర కూర్చుని భోజనం చేశారు. ఫ్రెండ్స్ రాకతో ఫకీరా ఇళ్లు సరదా, సందడిగా కలకలలాడింది. అప్పుడే సడెన్గా తారాసింగ్ గొంతులో మటన్ ముక్క ఇరుక్కుపోయింది.
చాలా సేపు ఇబ్బందిపడ్డాడు. తోటి స్నేహితులు సైతం అతడి గొంతులో ఇరుక్కుపోయిన మటన్ ముక్కను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఎంత ప్రయత్నించినా మటన్ ముక్క బయటకు రాకపోవడంతో తారాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అప్పటి వరకు సందడిగా సాగిన తండాలో తారాసింగ్ మృతితో విషాదం అలముకుంది. ఈ విషయం తెలిసి తారాసింగ్ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది.
crime news | nizamabad crime news | latest-telugu-news | telugu-news | telangana-crime