/rtv/media/media_files/2025/04/09/c5N60lstvmX3J6PKmSzx.jpg)
mla-rajasingh cases
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఈ బెదిరింపులపై ఆయన మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తనకు గతవారం నుంచి బెదిరింపు కాల్స్ వస్తు్న్నాయని.. నిన్న సాయంత్రం 4:11 నుండి 4:17 గంటల మధ్య ఒక్కొక్కటి ఒక నిమిషం వ్యవధిలో తొమ్మిది వేరు వేరు ఫోన్ నంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా రాజాసింగ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. తనను చంపేస్తామని, బాంబులతో దాడి చేస్తామంటూ బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. పోలీసులు తీరు పట్ల కూడా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర్ మేయర్ ఫిర్యాదు చేస్తే నిందుతుడిని పట్టుకున్నారని.. తాను ఫిర్యాదు చేస్తే పట్టి్ంచుకోవడం లేదని మండిపడ్డారు. కాగా రాజాసింగ్ కు బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రాజాసింగ్ కు బెదిరింపులు రాగా ఆయన పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజాసింగ్ ఆగ్రహం: పోలీసులపై విమర్శ
— The Bharat (@TheBharat_News) June 13, 2025
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మేయర్కు బెదిరింపు కాల్ వస్తే తక్షణ అరెస్టు, కానీ తనకు వందల బెదిరింపు కాల్స్ వచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు.
ఇది బీజేపీలో ఉన్నందుకేనా అని ఆగ్రహం… pic.twitter.com/iXkYxiVzOj