PM Modi : విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

New Update
vijay-rupani cm

vijay-rupani cm

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.  తన తోటి బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ  ఇక లేడని తాను అంగీకరించడానికి సిద్ధంగా లేనని ప్రధాని అన్నారు. రూపానీ నిరాడంబరమైన, సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారని, కష్టపడి పనిచేసేవారని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారని మోదీ తెలిపారు.  

ప్రతి పాత్రలోనూ తనదైన ప్రత్యేకత

పార్టీ సంస్థలో వివిధ బాధ్యతలను నిర్వర్తిస్తూనే గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అయినా, క్యాబినెట్ మంత్రిగా అయినా, తనకు కేటాయించిన ప్రతి పాత్రలోనూ రూపానీ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. ఆయనతో జరిగిన సమావేశాలు, చర్చలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

 గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ విమానంలో రూపానీ లండన్‌కు ప్రయాణించాలని అనుకున్నారు. ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నారు. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రయాణీకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు