/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
ap rains
హైదరాబాద్ ఒక్కసారిగా వాతావరణ మార్పుతో అల్లాడిపోయింది. ఉదయం నుంచి భరించలేని ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మేఘాలు ఆకాశాన్ని మూసేశాయి. క్షణాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆ వెంటనే మొదలైన భారీ వర్షం దాదాపు గంటన్నర పాటు నగరాన్ని అతలాకుతాలం చేసేసింది. అమీర్పేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి, బషీర్బాగ్, అల్వాల్, బాలానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో పెనుగాలులతో పాటు వడగళ్ల వాన కూడా పడింది.
Also Read: Telangana EAP CET: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
కోకాపేటలోని ఒక ఎత్తైన భవనం వద్ద సుడిగాలి బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలుల ధాటికి నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ఆఫీసుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలడానికి వీలులేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు.
Also Read: America-Indian Students: అమెరికాలో వీసా రద్దయిన విద్యార్థుల్లో 50% మంది భారతీయులే!
నిన్న కురిసిన వర్షానికి కంచన్బాగ్లో అత్యధికంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిందని సమాచారం. బహదూర్పురాలో 7.9 సెంటీమీటర్లు, యాకుత్పురా రెయిన్బజార్లో 7.6 సెంటీమీటర్లు, బేగంబజార్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. ఇది కేవలం హైదరాబాద్ నగరంలోని పరిస్థితి మాత్రమే కాదు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి.
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని 16 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట మరియు జోగుళాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
దీనిని బట్టి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు వర్షాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టమవుతోంది.
Also Read: Hyderabad: బిల్డింగ్ పై నుంచి కూలీన భారీ క్రేన్...పలు వాహనాలు ధ్వంసం!
Also Read: Canada: కెనడాలో కాల్పులు..భారతీయ విద్యార్థిని మృతి!
telangana rain alert | Telangana Weather | telangana weather news | telangana weather report today | telangana weather updates | telangana-weather-report | imd alert heavy rains to telangana | weather updates | telangana-weather-update