Ap-Telangana: బీ అలర్ట్...7 రోజులపాటు వర్షాలు..!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి భారత వాతావరణ శాఖ ఓ ముఖ్యమైన ప్రకటన చేసింది. 7 రోజులపాటూ.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.పగటిపూట ఎండలు మండిపోతుండగా.. సాయంత్రానికి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల రెండు రోజులు కూడా ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో రానున్న రెండు రోజులు ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్ జిల్లాలో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండ తీవ్రత, వడగాలులు అధికంగా ఉంటాయని వెల్లడించింది. ప్రజలు అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు అధికారులుఎల్లో అలర్ట్ జారీ చేశారు.రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు