Kalvakuntla Kavitha : కాళేశ్వరంపై నమ్మకముంది..కాంగ్రెస్ మీదే విశ్వాసం లేదు : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kalvakuntla Kavitha : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి మహా ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్ హౌస్ లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు ? తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? అని ప్రశ్నించారు.
కాళేశ్వరం కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది... కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదని కవిత అన్నారు. ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు.నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారన్నారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి విమర్శించారు.కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది . తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చుని వివరించారు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు.కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం... ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని తెలిపారు.40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని వివరించారు.
కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని దెప్పి పొడిచారు. . ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆయన్ను బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ అని హెచ్చరించారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లను బనకచర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాలర్ ఎగరేసి చెబుతుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్దే లింకేజ్ పాయింట్ ఉండాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అందువల్లే చంద్రబాబు తెలంగాణ జల దోపిడి చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారు. ఆయన సైతం మాట్లాడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటల అన్న తెచ్చుకోవద్దన్నారు. గోదావరి, పెన్నా లింకేజ్ పాయింట్ తుపాకుల గూడెం వద్దనుంచే ఉండేలా ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ తీసుకుంటామన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందన్న కవిత. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha : కాళేశ్వరంపై నమ్మకముంది..కాంగ్రెస్ మీదే విశ్వాసం లేదు : ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
kalvakuntla kavitha
Kalvakuntla Kavitha : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తోందని, కాళేశ్వరం విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే అది తెలంగాణ మొత్తానికి ఇచ్చినట్లేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం జాగృతి ఆధ్వర్యంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి మహా ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన కమిషన్ ఈ ప్రాజెక్టు కోసం 90 శాతం పంప్ హౌస్ లు కట్టిన మెఘా కృష్ణారెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రు ? తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా ? అని ప్రశ్నించారు.
Also Read: ఆర్మీ సమాచారం లీక్.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
కాళేశ్వరం కమిషన్ పై మాకు నమ్మకం ఉన్నది... కానీ కాంగ్రెస్ పార్టీపై ఎటువంటి విశ్వాసము లేదని కవిత అన్నారు. ఎస్సారెస్పీ నిర్మించడానికి కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం పట్టిందన్నారు.నెహ్రు శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్ కు ఎన్టీఆర్ మరమ్మత్తులు చేయించారన్నారు. కాంగ్రెస్ కట్టిన మిడ్ మానేరు ప్రాజెక్టు కొట్టుకుపోతే కేసీఆర్ బాగు చేయించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి విమర్శించారు.కాళేశ్వరం లేకపోతే 35% తెలంగాణ భూభాగం ఎడారిగా మారే ప్రమాదం ఉంది . తక్షణమే మేడిగడ్డ బ్యారేజీకి మనమత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా ? కాళేశ్వరం కమిషన్ కాదు... అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదు ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కీమీ మేర టన్నెల్ ఉందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చుని వివరించారు. కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చు.కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం... ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందని తెలిపారు.40 టీఎంసీలతో హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం అని వివరించారు.
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్పై స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణ హత్య
కేసీఆర్ ది గట్టి గుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టును నిర్మించారు.కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదని దెప్పి పొడిచారు. . ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆయన్ను బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ అని హెచ్చరించారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లను బనకచర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాలర్ ఎగరేసి చెబుతుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్దే లింకేజ్ పాయింట్ ఉండాలని తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఫలించిన 18 ఏళ్ళ నిరీక్షణ..మిన్నంటిన ఆర్సీబీ సంబరాలు
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని అందువల్లే చంద్రబాబు తెలంగాణ జల దోపిడి చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒక్క మాట మాట్లాడటం లేదన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారు. ఆయన సైతం మాట్లాడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటల అన్న తెచ్చుకోవద్దన్నారు. గోదావరి, పెన్నా లింకేజ్ పాయింట్ తుపాకుల గూడెం వద్దనుంచే ఉండేలా ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ తీసుకుంటామన్నారు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టుపై కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించాల్సిన సమయం వచ్చిందన్న కవిత. గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Also Read : ట్రంప్కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!