Jammu and Kashmir: ఆర్మీ సమాచారం లీక్‌.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు

భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీళ్లు ముగ్గురు ప్రస్తుతం జైల్లో ఉన్నారు.

New Update
LG Manoj Sinha sacks three Jammu and Kashmir government employees over LeT, Hizb terror links

LG Manoj Sinha sacks three Jammu and Kashmir government employees over LeT, Hizb terror links

భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తోందనే ఆరోపణలతో ఇటీవలే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భద్రతా దళాలకు సంబంధించిన సమాచారాన్ని ఉగ్ర సంస్థలకు చేరవేస్తున్నారనే ఆరోపణలో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Also Read: ఇండియాకు చైనా వార్నింగ్.. ‘పాక్ లాగే మీకూ నీళ్లు ఉండవు’

మాలిక్ ఇష్ఫక్ నసీర్ (కానిస్టేబుల్), అజాజ్ అహ్మద్ (టీచర్), వసీద్‌ అహ్మద్ ఖాన్ (మెడికల్ కాలేజ్ జూ.అసిస్టెంట్).. ఈ ముగ్గురికీ కూడా కూడా లష్కరే తోయాబా(LetT), హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్(HM) అనే ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీళ్లను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు జైళ్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ ముగ్గురిపై వేటు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Also Read: సొంత S-400తో ఉక్రెయిన్ చేతిలో దెబ్బతిన్న రష్యా.. మరి ఇండియా పాక్‌ని ఎలా చిత్తు చేసిందంటే?

మరోవైపు పాక్‌కు గూఢచర్యం చేస్తున్న మరో పంజాబ్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తార్న్‌ తరణ్‌ జిల్లాకు చెందిన గగన్‌దీప్‌ సింగ్ అనే వ్యక్తికి పాక్‌ గూఢచార సంస్థ ISIతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో ఆర్మీ దళాల మోహరింపు, వ్యూహాత్మక ప్రదేశాల వివరాలతో పాటు సున్నిత సమాచారాన్ని పాక్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించామని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు.  

Also Read: హఫీజ్ సయీద్ కొడుకుతో పాకిస్తాన్ స్పీకర్.. ఉగ్రవాదులతో లింకుల విషయంలో మరో సాక్ష్యం

 telugu-news | rtv-news | national-news | india-pakistan 

Advertisment