Hyderabad Bomb Threat: హైదరాబాద్‌లోని ఆ స్కూల్ కి బాంబు బెదిరింపులు.. టెన్షన్ టెన్షన్

హైదరాబాద్‌లోని నాచారం ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మెయిల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబ్‌ స్క్వాడ్‌ ద్వారా స్కూల్‌లో తనిఖీలు చేస్తున్నారు.

New Update
bomb calls

bomb calls

Hyderabad Bomb Threat:  హైదరాబాద్ లోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి రెండోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మెయిల్ ద్వారా పాఠశాల యాజమాన్యానికి బెదిరింపులు పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీస్ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను పెట్టి స్కూల్ అంతా తనిఖీలు చేశారు.  భద్రతా దృష్ట్యా విద్యార్థులు, పాఠశాల సిబ్బందిని స్కూల్‌ నుంచి  ఖాళీ చేయించారు. 

ఇది కూడా చూడండి: occult worship : కర్నూలు జిల్లా బి తాండ్రపాడు ఎస్సార్ విద్యాసంస్థల్లో  క్షుద్ర పూజల కలకలం

భద్రతను మరింత పెంచాలి 

ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విద్యా సంస్థల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. బెదిరింపుల వెనుక ఉన్నవారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఘటనకు సంబంధించిన అంశాలను, ఇతర  సాక్ష్యాలను పరిశీలిస్తున్నారు. బాంబు బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు భద్రతను మరింత పెంచాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు  తీసుకోవాలని స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

Mauni Amavasya 2025: మూడు గ్రహాల కలయికతో మౌని అమావాస్య.. ఈ నాలుగు రాశుల వారికి అన్నీ శుభాలే!

Advertisment
Advertisment
తాజా కథనాలు