Guru Pournami: తెలుగు రాష్ట్రాల్లో గురుపౌర్ణమి వేడుకలు.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

నేడు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్తున్నారు.

New Update
Guru Pournami

Guru Pournami

నేడు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్తున్నారు. ఎక్కువగా సాయిబాబా, దత్తాత్రేయ ఆలయాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలతో పాటు అన్ని జిల్లాల్లోని ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.

ఇది కూడా చూడండి: Deputy CM Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కల్యాణ్..బాలుడికి లక్షప్రోత్సాహకం

ఇది కూడా చూడండి:Amit Shah: రిటైర్మెంట్ తర్వాత నేను చేసేది అదే.. అమిత్ షా కీలక ప్రకటన

ప్రత్యేక పూజలు నిర్వహించి..

భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తమ గురువుల ఆశీస్సులు పొందుతున్నారు. కొందరు భక్తులు దీక్షలు చేపట్టి, గురు చరిత్ర పారాయణాలు చేస్తున్నారు. గురు పౌర్ణమి పవిత్ర దినం గురువులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు, వారి బోధనలను స్మరించుకునేందుకు ఉద్దేశించినదని పండితులు చెబుతున్నారు. ఈ రోజున గురువులను సేవించడం వల్ల జ్ఞానం, శ్రేయస్సు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి.

ఇది కూడా చూడండి:Population Crisis : కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో..స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..ఎక్కడంటే?

Guru Pournami | saibaba | temples | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | latest telangana news | andhra-pradesh-news

Advertisment
Advertisment
తాజా కథనాలు