Road Accident: నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం..డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా..స్పాట్‌లో 8మంది

నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

New Update
FotoJet - 2025-11-08T085151.599

Fatal accident in Nalgonda district

Nalgonda Accident:  నల్గొండ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం(road accident) చోటు చేసుకుంది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్ -విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఆక్షణమే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.

Also Read:  హ్యాష్ ఆయిల్‌ విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు

Fatal Accident In Nalgonda District

అయితే ప్రమాద సమయంలో ఇన్నోవాలో 8 మంది ఉండగా వారంతా క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హైవేపై అడ్డంగా వాహనం బోల్తా పడటంతో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుకు కారు అడ్డంగా పడిపోవడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాన్ని పక్కకు తీసి.. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అంతరిక్షంలో అద్భుతం.. స్పేస్ స్టేషన్‌లో వంట చేసిన వ్యోమగాములు

Advertisment
తాజా కథనాలు