/rtv/media/media_files/2025/03/21/hOadt8Vg5V14QxIgtLCB.jpg)
CM Revanth reddy
CM Revanth Reddy: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే.. గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం.. స్పీకర్ కు లేఖ రాయమని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. నువ్వు చెప్పిన తారీకున అసెంబ్లీ పెట్టించే బాధ్యత మా మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారన్న రేవంత్ గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చ చేద్దాం రమ్మని పిలుపునిచ్చాడు. మొత్తం వివరాలతో నేను వస్తా…నీవు రా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. రైతు భరోసా విజయోత్సవ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
పదేళ్లవాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో చర్చ పెట్టండని రేవంత్ రెడ్డి కోరారు. కేసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయన్నారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు చెల్లించిండు.. మరి వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది.దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి.. ఎందుకు పూర్తి చేయలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? అని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
Also Read: సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్లో పెడితేనే.. అమెరికాకు వీసాలు
ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? అన్న రేవంత్ రెడ్డి రూ. లక్ష కోట్లు దోచుకుని, వేల ఎకరాలు ఆక్రమించుకుని ఇవాళ బనకచర్ల విషయంలో నాపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారన్నారు. నేను చంద్రబాబుతో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాణ్ణి కదా? రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని కేసీఆర్ అని మండిపడ్డారు. సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజలతో కదం కదం కలిపానన్నారు.
Also Read: ఈపీఎఫ్ఓ చందాదారులకు అదిరిపోయే న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు!
సచివాలయం సాక్షిగా రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇవాళ పండుగ చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రైతాంగం అండతో చిన్న వయసులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు.ఆనాడు కేసీఆర్ రైతు బందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7625 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు.25 లక్షల 35 వేల 964 మంది రైతులకు రూ. 20 వేల 617 కోట్లు వారి ఖాతాల్లో వేసి రుణవిముక్తులను చేశామని సీఎం వివరించారు. కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. మామ శకుని అయితే అల్లుడు శనీశ్వరుడు.. శకుని మామకు తగ్గట్టు శనీశ్వర అల్లుడు జమై రైతులకు మీరేం చేశారని మాట్లాడతుండ్రు అని రేవంత్ ఫైర్ అయ్యారు.
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
ఆనాడు రైతు భరోసా ఇవ్వాలంటే కోకాపేటలో భూములు అమ్మిండ్రు,రైతు రుణమాఫీ చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు..రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. రైతులకు నీళ్లిస్తామని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొట్టిండు. రైతుల ముసుగులో, రైతు సెంటిమెంట్ ను ఆదాయ వనరుగా మార్చుకున్నారు.. వేల కోట్లు సంపాదించుకున్నారు. ఈ వేదిక నుంచి సూటిగా అడుగుతున్నా.. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటి? మొయినాబాద్ లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వచ్చింది? జన్వాడలో కేటీఆర్ కు, గజ్వేల్ లో కేసీఆర్ కు ఫామ్ హౌస్ లు ఎట్లా వచ్చినయ్ మీరు వేల కోట్ల అధిపతులయ్యారు? రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు ఎలా వచ్చింది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు.. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాళా తీసిందన్నారు.
ఇది కూడా చూడండి: Jeedimetla Murder: జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. నిందితురాలు చెల్లి ఏం చెప్పిందంటే?
పదేళ్లు వాళ్లు చేయలేనిది మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తా… పదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పు కేసీఆర్ అంటూ సవాల్ విసిరారు.18 నెలల్లో 1 లక్షా 4 వేల కోట్లు కేవలం రైతుల కోసం ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం మాది. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన మాది. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని ఈ వేదిక నుంచి అడుగుతున్నా .కాళేశ్వరం పేరుతో మీరు లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో రైతుల కోసం 1 లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది..వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ప్రజలారా ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా..ఆలోచన చేయండి..అంచనా కట్టండి..బేరీజు వేయండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం