Nitish Father Emotional Words | గోదావరిలో 8 మంది గ*ల్లంతు | Godavari River Tra*gedy Mammidivaram
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసేత్రివేణి సంగమంలో నేటి నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి.
తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మెడిసిన్లో సీట్ రావడంతో ఓ యువకుడు కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్లాడు. స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్నానం కోసం గోదావరిలో ఇద్దరు యువకులు దిగి గల్లైంతయ్యారు. అక్కడిక్కడే వారు మృతి చెందారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి తెలంగాణ కీలక విజ్ఞప్తి చేసింది. ఈ నదుల నుంచి తరలించే నీటిలో 148 టీఎంసీల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని మరోసారి జాతీయ జల అభివృద్ధి సంస్థ (NWDA)ను కోరింది.
గోదావరి జలాలు పెన్నా నదికి తరలించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కృష్ణానది మీదుగా ఈ జలాలను కలిపే ప్రక్రియపై అధికారులతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశామలం చేయాలని భావిస్తున్నారు.
భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది.ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయికి నీటిమట్టం చేరింది. నీటిమట్టం 43 అడుగుల స్థాయికి చేరింది. మరికాసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.