CM Revanth: మరో 50 సార్లు కలుస్తా, ఆయనతో కలిసి పనిచేస్తా.. సీఎం రేవంత్ సంచలనం!

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. 

New Update
rvn md

CM Revanth Reddy interesting comments on Modi

CM Revanth: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసిపనిచేస్తానని సీఎం రేవంత్ చెప్పారు. అవసరమైతే మోదీని మరో 50 సార్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని, కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. 

Also Read: సన్నగా ఉంటే గుండెపోటు వస్తుందా..? ఈ విషయాలను గుర్తుంచుకోండి

ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గం బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్నాయన్నారు. కేంద్రంపై అలిగితే రాష్ట్రాలకే నష్టమని చెప్పారు. అలాగే రాష్ట్ర ఆడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఐదేళ్లలో కోటి మందిని కోటీశ్వరులను చేస్తానని మాట ఇస్తున్నా అన్నారు. మెదక్ ప్రాంతానికి ఇందిరమ్మకు ఉన్న అనుబంధం విడదీయలేనిదని ఆయన అన్నారు. మెదక్ పేరు గుర్తొస్తేనే ఇందిరమ్మను తలచుకుంటామని తెలిపారు. అలాగే ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్‌ని తలుచుకుంటామని ఆయన వివరించారు. ఇందిరమ్మ తన చివరి రోజుల్లో మెదక్ ఎంపీగా కొనసాగారని గుర్తించేశారు. గత ప్రభుత్వ హయాంలో నిమ్జ్ అభివృద్ధి కుంటుపడిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.

Also read: MP Raghunandan Rao: కవిత లేఖ రాజకీయ పంచాయతీనా? ఆస్తుల పంచాయతీనా?

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిమ్జ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం పెంచాం, భూసేకరణను వేగవంతం చేశామని చెప్పుకొచ్చారు. త్వరలో హ్యుందాయ్ కార్ల తయారీ కంపెనీ ఇక్కడ పనులు ప్రారంభిస్తోందని చెప్పారు. నిమ్జ్ భూ నిర్వాసితులైన 5612 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ కుటుంబాలకు భోజనాలు పెట్టి ఇండ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత జగ్గారెడ్డికి అప్పగించారు. ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు.. అభివృద్ధిలో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు.

Also Read: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన 

Also Read: మావోయిస్టుల అణచివేత.. ఏడుగురు CRPF కమాండోలకు శౌర్య చక్ర ప్రదానం

Advertisment
Advertisment
తాజా కథనాలు