/rtv/media/media_files/2025/03/10/0xdUcYbibR6KDBC71i3I.jpg)
Telangana CM Revanth Reddy
CM Revanth: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్ అన్నారు. కొందరు తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2 రూపాయలకే కిలో బియ్యం దివంతగ మాజీ సీఎం ఎన్టీఆర్ బ్రాండ్ అయితే తన బ్రాండ్ యంగ్ ఇండియా స్కూల్ అన్నారు. ఈ స్కూల్లలో చేరే వారందరికీ 100 శాతం ఉద్యోగాలు ఇస్తామన్నారు. పోలీసుల పిల్లల చదువుల కోసం తమ ప్రభుత్వం గొప్ప ఆలోచన చేసిందన్నారు. అలాగే తెలంగాణలోనూ త్వరలోనే నర్సరీ ప్లే స్కూల్ అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
కొందరే చరిత్రలో గుర్తుండిపోయారు..
ఈ మేరకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రతీ పోలీస్ సిబ్బందికి ఇది అత్యంత ముఖ్యమైనది చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని గుర్తు చేశారు. ఆనాడు పండిట్ జవహర్ నెహ్రూ సారథ్యంలో దేశంలో యూనివర్సిటీల పునాదులు పడ్డాయి. నెహ్రూ దార్శనికతతోనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి చేరింది. దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు. ఆ కొద్దిమంది తీసుకున్న నిర్ణయాలు చరిత్రను మలుపు తిప్పాయి. ముఖ్యమంత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉందని చెప్పుకుంటున్నారు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు.హైదరాబాద్ లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్ ను గుర్తుంచుకుంటారని అన్నారు.
Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?
అలాగే ఇవాళ నా క్రియేట్ చేసిన నా బ్రాండ్ 'యంగ్ ఇండియా' మహాత్ముడి స్ఫూర్తితో యంగ్ ఇండియా బ్రాండ్ ను తెలంగాణలో క్రియేట్ చేసుకున్నాం. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్. నిరుద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం. ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. దేశంలోనే ది బెస్ట్ యూనివర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గుతుతోందన్నారు. ఒకటో తరగతి నుంచి ఉన్న ప్రభుత్వ స్కూల్స్ విధానంలో మార్పులు తీసుకొచ్చి, ప్రీ-స్కూల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సైనిక్ స్కూల్ కు ధీటుగా పోలీస్ స్కూల్ ను తీర్చిదిద్దాలి. ఇందుకు కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ స్కూల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. సామాజిక బాధ్యతగా ప్రైవేటు కంపెనీలు పోలీస్ స్కూల్ కు ఆర్ధిక సాయం అందించాలి. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
school | hyderabad | police | telugu-news | today telugu news