/rtv/media/media_files/2025/02/20/uqp7Uv1mdRu67cn0D7S9.jpg)
Ganja Photograph: (Ganja)
Shamshabad Airport : మాదకద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయి రవాణపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కేటుగాళ్లు ఏదో ఒక మార్గంలో రాష్ర్టంలోకి వాటిని తీసుకువస్తున్నారు. కాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి బంగారం, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టబడిన సందర్భాలుండగా తాజాగా గంజాయి పట్టుపడటం కలకలం రేపింది.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణీకుడు ఓజీ కుష్ అనే గంజాయిని 24 బ్యాగుల్లో తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని కస్టమ్ అధికారులు తెలిపారు.బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారీగా గంజాయి పట్టుబడటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Also Read : ఉగ్రవాదులకు సహాయం.. జమ్మూకశ్మీర్లో ఇద్దరు అరెస్టు!
కాగా.. నిన్న భువనగిరిలో సుమారు రూ.10 కోట్ల విలువైన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 2024--25 లో పలు కేసుల్లో 2010.135 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, గంజాయినంతటిని కాల్చివేశామని డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్ పర్సన్, రైల్వే ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. మొత్తం 74 కేసుల్లో రూ.10 కోట్ల 5 లక్షల 6,750 విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, నియంత్రణ, అసాంఘిక, శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా సికింద్రాబాద్, ఖాజీపేట రైల్వేస్టేషన్లతో పాటు చర్లపల్లి, జనగామ, భువనగిరి తదితర రైల్వేస్టేషన్లలో కొత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Khammam Digital Arrest: ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: వెడ్డింగ్ షూట్లో విషాదం.. వధువుపై పేలిన బాంబు.. వీడియో వైరల్