/rtv/media/media_files/2025/05/30/ARAvNEOLqxBgQgCQ6E5j.jpg)
Telangana Sarpanch Elections
Local elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. జూలై లోనే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ చివరివారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది.ఆగస్టు రెండో వారం నాటికి ఎన్నికలను పూర్తిచేయాలని నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయి. వీటన్నింటిపైనా ఉన్నతాధికారులు మరోసారి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
Local Elections In Telangana
ఇక గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ స్థానిక సంస్థల్లో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం12,633 పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి ఎన్నికలు జరుగుతాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పంచాయతీలన్నింటిలో సుమారు 1,13,500కుపైగా వార్డులున్నాయి. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసే అవకాశం ఉంది. ఆ పంచాయతీల్లోని వార్డులుపోగా.. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియనంత ఆగస్టులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: Pakistan: బుద్ధి మార్చుకోని పాక్.. పుల్వామా తరహా దాడికి స్కెచ్.. ఇదిగో ప్రూఫ్!
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆలోచించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లులను ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై నిర్ణయాన్ని కేంద్రం పెండింగ్లో పెట్టింది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ను ఆమోదిస్తే ఇతర రాష్ర్టాలనుంచి ఒత్తిడి వస్తుందని కేంద్రం భావిస్తోంది. అయితే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ నాటికల్లా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే..పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దాని ప్రకారం మొత్తంగా 50శాతం దాటకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. పాత రిజర్వేషన్ ప్రకారం స్థానిక సంస్థల పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి.. మిగతా రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన గతంలో బీసీలకు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 21--22 శాతం, మున్సిపాలిటీల్లో 31శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే పద్థతి అవలంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే స్థానిక సంస్థల్లో కొత్త రిజర్వేషన్లు పెంచలేని పరిస్థితి వస్తే.. కాంగ్రెస్ పార్టీపరంగా బీసీలకు 42శాతం స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్ ఇదివరకే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దాన్ని అమలు చేయాలని బీసీ నేతల నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం దీనిపై కసరత్తు చేస్తోంది. గతంలో ప్రకటించిన విధంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను పార్టీ పరంగా అమలు చేసే అవకాశం ఉంది.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
మరోవైపు పార్టీ పరంగా నేతలకు పదవులు కేటాయించే విషయంలో నూ సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి రానున్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను వారికి పార్టీ పదవులు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి నేతలందరినీ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ సూచించారు. దానిప్రకారం గ్రామ, మండల, జిల్లా స్థాయి వరకు అవకాశం ఉన్న పదవులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు కూడా స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని భావిస్తోంది.
Also Read: ఇండియాలో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ వాయిదా.. ఎందుకంటే?
local-body-elections | Local Bodie Elections 2025 | cm revanth on local body elections | local body elections telangana | local body elections in telangana 2025 | local body elections in telangana | congress-party