/rtv/media/media_files/2025/01/28/HTK0n2AKKdJujag0kybG.jpg)
aghori Photograph: (aghori)
Aghori in Komuravelli: అఘోరి మరోసారి తెలంగాణలో హల్ చల్ చేస్తోంది. కొమురవెల్లి మల్లికార్జున ఆలయంలోకి నగ్నంగా వెళ్లి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ బట్టలేసుకుని లోపలికి వెళ్లాలని అధికారులు సూచించారు. దీంతో తీవ్ర ఆగ్రహనికి గురైన అఘోరి పలువురు అక్కడున్న వారిపై కత్తితో దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: వాటర్ బాంబ్ కు ధీటుగా..చైనా సరిహద్దుల్లో బ్రహ్మపుత్రపై భారీ రిజర్వాయర్
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి టెంపుల్ దగ్గర రెచ్చిపోయిన అఘోరీ
— Pulse News (@PulseNewsTelugu) January 28, 2025
టెంపుల్ మెయిన్ గేట్ నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వాలన్న అఘోరీ
బట్టలు వేసుకుని దర్శానికి రావాలని సూచించిన ఆలయ అధికారులు
ఆగ్రహంతో కత్తితో దాడి చేసిన అఘోరీ
ఘటనలో పలువరికి గాయాలు#Aghori #Siddipeta… pic.twitter.com/0AXdKSzt0V
Also Read: గూగుల్ మ్యాప్స్లో మారిన గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు..కానీ అక్కడ మాత్రం!
కత్తితో దాడి
మంగళవారం మధ్యాహ్నం కొమురవెల్లి ఆలయానికి వెళ్లిన అఘోరిని చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆమె ఆశీర్వాదం పొందేందుకు గుంపులు గుంపులుగా ఆమెవైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే అఘోరి ఆలయ ప్రవేశం చేసే క్రమంలో సిబ్బంది అడ్డుకున్నారు. ఒంటిపై బట్టలు వేసుకుని ఆలయంలోకి రావాలని, జనాలను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. అయినప్పటికీ ససేమీరా అంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆలయ అధికారులు కలగజేసుకుని బలవంతంగా బట్టలు తొడిగించారు. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన అఘోరి కోపంతో ఊగిపోయింది. తనతో ఫొటోలు దిగాలనుకున్న వారిని భయాందోళనకు గురిచేసింది. అయినా వినకుండా తన దగ్గరకు వచ్చిన జనంపై కత్తితో దాడిచేసింది. కారులో తనవెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో ఇద్దరి ముగ్గురిని గాయపరిచింది. ఓ వ్యక్తిని వెన్నులో పొడవగా చర్మంపై అతనికి మూడు ఇంచుల రంధ్రం పడింది.
Also Read: UP Viral News: ఆమెకు 60, అతనికి 30.. ఇదొక విచిత్రమైన ప్రేమ కథ!
అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అఘోరిని అదుపులోకి తీసుకున్నారు. అఘోరిపై మర్డర్ అంటెప్ట్ కేసు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు చట్టరిత్యా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమైనట్లు సమాచారం. ఇటీవల కరీంనగర్ నుంచి పెద్దపల్లిలో వైపు వెళ్తున్న అఘోరిని కొంతమంది ఆకతాయిలు వెంట పడి వేధించారు. దీంతో కారు ఆపి వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పారు.
Also Read: Hyderabad: హైదరాబాద్లోని ఆ స్కూల్ కి బాంబు బెదిరింపులు.. టెన్షన్ టెన్షన్
గత నవంబర్ లోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి నగ్నంగా అనుమతించకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై, కారుపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడతానంటూ బెదిరించింది. వరంగల్ నగర శివారు బెస్తంచెరువు శ్మశాన వాటికలో పూజలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. స్థానికులంతా ఫిర్యాదు చేయడంతో మామునూరు పోలీస్ స్టేషన్లో లేడీ అఘోరీపై సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు.