/rtv/media/media_files/2025/06/22/31-tolas-gold-stolen-from-a-house-in-bhainsa-2025-06-22-15-07-08.jpg)
31 tolas gold stolen from a house in Bhainsa, Nirmal District
నిర్మల్ జిల్లా భైంసాలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఏకంగా 31 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. భైంసాలోని రాహుల్నగర్ హనుమాన్ మందిర్ ప్రాంతంలోని మచ్చ గజ్జారామ్, పంచపూల దంపతులు ఉంటున్నారు. వీళ్లు శుక్రవారం మధ్యాహ్నం నర్సాపూర్ (జి) గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు.
Also Read: ఇరాన్పై అమెరికా దాడులు.. అత్యంత సురక్షిత బంకర్లోకి ఖమేనీ
చివరికీ ఆ ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు శనివారం అర్ధరాత్రి అక్కడికి వచ్చారు. మెయిన్ డోర్ తాళం పగలగొట్టి లోపలికి వచ్చారు. బీరువాలు పగులగొట్టేశారు. వస్తువులన్నీ ఎక్కికక్కడ పడేశారు. ఇంట్లో దొరికిన 31 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇక ఆదివారం తెల్లవారుజామున ఎదురింటి వారికి గజ్జారమ్ ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి ఆయనకు ఫోన్ చేసి విషయం తెప్పారు.
Also Read: అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్
అనంతరం గజ్జారమ్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీఐ చోరీ జరిగిన వ్యవహారాన్ని సీసీటీవీ ఫుటేజ్లో పరిశీలించారు. క్లూస్ టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.
Also Read: ఫార్డో అణు కేంద్రంపై పెద్ద ఫ్లాష్.. ఉపగ్రహ వీడియో
Also Read: పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది.. కాబట్టే ఇలా చేశాం: ట్రంప్