పశ్చిమాసియా దేశాలను ఇరాన్ భయపెడుతోంది.. కాబట్టే ఇలా చేశాం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇరాన్‌పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని చెప్పుకొచ్చాడు.

New Update
Donald Trump

Donald Trump

ఇరాన్‌ అణుకేంద్రాల లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్‌పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని ట్రంప్ తెలిపారు.

ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి వచ్చిందని అగ్రరాజ్యం అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. ఇరాన్ కీలకమైన అణుస్థావరాలను ధ్వంసం చేశాం. దాని అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యమని అమెరికా ప్రకటించింది. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును ఆపడమే మా లక్ష్యం. పశ్చిమాసియా దేశాలను ఇరాన్‌ భయపెడుతోంది. ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత టెహ్రాన్‌దే. ఇరాన్‌లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. టెహ్రాన్‌ శాంతిని నెలకొల్పకపోతే.. దాడులు మరింత తీవ్రంగా ఉంటాయి. యూఎస్, టెల్‌అవీవ్‌ కలిసి పనిచేస్తాయని ట్రంప్‌ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు