అమెరికా దాడులకు మూల్యం చెల్లించుకోవాల్సిందే.. ఇరాన్ మంత్రి వార్నింగ్

అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ట్రంప్ ఆట ఆరంభించాడు.. మేం ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు.

New Update
Abbas Araghchi

అమెరికా దాడులతో ఇరాన్ ఇజ్రాయిల్‌పై ప్రతీకారదాడులకు దిగింది. ఇరాన్‌ సుప్రీం లీడర్ ఖమేని ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌తో వరుస ఎటాక్స్ చేస్తోంది. టెల్‌అవీవ్, జెరూసలేంపై క్షిపణులు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. టెల్‌ అవీవ్, జెరూసలేం, ఇతర నగరాల్లో ఎమర్జె్న్సీ సైరన్లు మోగించారు. దీంతో వీధుల్లో ఇజ్రాయెల్‌ పౌరులు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, బ్యాంకులను ఇజ్రాయిల్‌ మూసివేసి అత్యవసర పరిస్థితి విధించినట్లు నెతన్యాహూ తెలిపారు.

అలాగే తమ దేశంపై అమెరికా చేసిన దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. అమెరికా దాడులపై ప్రపంచదేశాలు స్పందించాలని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కోరారు. ఐక్యరాజ్య సమితి అమెరికా చర్యలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రంప్ ఆరంభించాడు.. మేం ఆట ముగిస్తామని ఇరాన్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది ఇరాన్ విదేశాంగ మంత్రి- అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు. అమెరికాకు బుద్ధి చెప్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎర్ర సముద్రంపైకి వచ్చే అమెరికన్‌ నౌకలను పేల్చేస్తామని హౌతీలు పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు