నీ అయ్య జాగీరా..! | YS Jagan Slams CM Chandrababu Naidu | Pawan Kalyan | YCP VS TDP | AP News | RTV
మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
యాక్టర్, వైసీపీ లీడర్ పోసాని కృష్ణ మురళిని బుధవారం ఏసీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోసాని అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. పోసానిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఖండించారు. ఆయన భార్య కుసుమలతకు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు.
విజయవాడ వ్యభిచారం కేసులో తన వీడియోలు విడుదల చేసిన పోలీసులపై వైసీపీ నేత శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 'పోలీసులు తీరు వల్ల నా కుటుంబం రోడ్డున పడింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానంటోంది. మీ అంతు చూస్తా' అని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
విజయవాడలో ఇటీవల వ్యభిచార గృహం గుట్టు రట్టు చేసిన పోలీసులకు వైసీపీ నేత పట్టుబడటం సంచలనం రేపుతోంది. ఈ కేసులో మాజీ ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్నాయక్ను A10 గా నమోదు చేశారు. శంకర్ మంచం కింద నక్కి నక్కి దాక్కున్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగిస్తారు. తర్వాత సభ వాయిదా వేసి బీఏసీ మీటింగ్ నిర్వహించనున్నారు. 3వారాల పాటు సమావేశాలు ఉండనున్నట్లు ప్రాథమిక సమాచారం.