గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. కొడాలి నాని బయటకు రావాలంటూ రాళ్లు, చెప్పులతో దాడికి తయత్నించారు.
టీడీపీ మహిళా కార్యకర్తలు, నాయకులు కొడాలి నానికి చీర, గాజులు తీసుకువచ్చారు. టీడీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు.