4 వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు.. | Yashaswini Reddy | RTV
4 వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు.. | Palakurthi MLA Yashaswini Reddy replies for an old lady as she does not receive the pension from the Government | RTV
4 వేల రూపాయల పెన్షన్ ఎప్పుడు ఇస్తారు.. | Palakurthi MLA Yashaswini Reddy replies for an old lady as she does not receive the pension from the Government | RTV
ఈ రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఓ వృద్ధురాలు ఊహించని షాక్ ఇచ్చింది. తనకు ఇప్పుడు వచ్చే రూ.2 వేల పెన్షన్ సరిపోవడం లేదని వాపోయింది. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా పెన్షన్ ను రూ.4 వేలకు ఎప్పుడు పెంచుతారని ప్రశ్నించింది.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిని జనగామ జిల్లా గిర్నీ తండాలో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎన్నికల హామీల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు రూ.50వేలు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆ హామీని ఇంకెప్పుడు నెరవేరుస్తారని ప్రజలు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీశారు.
సురేఖకు యశస్విని రెడ్డి మద్దతు | Telangana Minister Konda Surekha gets tremendous support and announces the same from Palakurthi MLA Yasashwini Reddy | RTV
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటుచేసుంది. స్టేజ్ కుప్పకూలడంతో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. సినీనటి ప్రియాంక మోహన్ కు ప్రమాదం తప్పింది.
తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మాల్ ఓపెనింగ్ సందర్భంగా అక్కడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీ రెడ్డి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇచ్చిన హామీని నిబెట్టుకున్నారు. తొర్రూరు మండలం గుర్తూరులో సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు భూమిపూజ చేశారు.దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లలో ముగ్గురు తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మెదక్ నుంచి గెలిచినడాక్టర్ మైనంపల్లి రోహిత్, నారాయణపేట నియోజకవర్గం నుంచి పర్ణిక రెడ్డితో పాటు పాలకుర్తి నుంచి గెలిచిన యశస్విని రెడ్డి ఉన్నారు.