Ap Crime: ఏపీలో దారుణం.. సినీ ఫక్కీలో డెడ్ బాడీ పార్శిల్!
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో డెడ్బాడీ కలకలం రేపింది. ఓ మహిళకు వచ్చిన పార్శిల్లో గుర్తుతెలియని మృతదేహం రావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికలు డిసెంబర్ 5న జరగనున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పాటు వైన్ షాప్లు మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి డిసెంబర్ 5 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లా మైసన్నగూడేంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటకు ఆశ్రయం ఇచ్చినందుకు యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. భయపడిన ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
కోనసీమ జిల్లా పి. గన్నవరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా పెళ్ళి కొడుకు కుటుంబ సభ్యులపై కూడా దాడికి దిగాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో శ్మశానవాటికకు వెళ్లే దారిలేకపోవడంతో ఎస్సీ కాలనీవాసులు మోకాల్లోతు నీళ్లలో మృతదేహాన్ని తరలించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమకీ దుస్థితి తప్పడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి శ్మశానవాటికకు రోడ్డు వేయాలని కోరుతున్నారు.
ఏలూరు జిల్లా భీమడోలులో తన ప్రియుడి కోసం ఓ ప్రియురాలు ఆందోళన చేపట్టింది. పొలాసానిపల్లికు చెందిన రావికుమార్(25) పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టింది.
ఏలూరు జిల్లా రామానుజపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్య సాయి లక్ష్మిను భర్త సూర్య కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూర్యచంద్రంను అదుపులోకి తీసుకున్నారు.