/rtv/media/media_files/2025/05/05/FMNgg5ddzUjHmPlYgXSX.jpg)
vizag Seethammadara incident
AP News: ఏపీలో మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖా హెచ్చరికలు జారీ చేసింది. ఇంతలోనే విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈదురుగాలులకు చెట్టు విరిగి ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.
విశాఖపట్నం సీతమ్మధారలో విషాదం..
— RTV (@RTVnewsnetwork) May 5, 2025
రోడ్డుపై ఒక్కసారిగా విరిగిపడిన చెట్టు.. చెట్టు స్కూటీ మీద పడటంతో అక్కడికక్కడే మహిళ మృతి
ప్రమాదంలో నుజ్జునుజ్జైన మరోకారు..సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు pic.twitter.com/zXTS6WG2Qe
చెట్టు విరిగి మహిళ మృతి
అయితే మహిళ స్కూటీ మీద వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టు విరిగి ఆమె పై పడింది. దీంతో ఆమె స్పాట్ లోనే మరణించింది. స్కూటీ తో పాటు అక్కడే ఉన్న మరో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
ఇది ఇలా ఉంటే భారీ వర్ష సూచన నేపథ్యంలో వాతావరణ శాఖా పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. అలాగే విశాఖపట్నం, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈదురుగాలుల సమయంలో ఇంటి నుంచి బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ తీగల కింద ఉండకూడదని హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
latest-news | ap-news | vizag
Also Read: This Week Movie: మూవీ లవర్స్ కి పండగే.. ఈ వారం థియేటర్, ఓటీటీలో అదిరిపోయే సినిమాలు!