Double Decker Bus: వైజాగ్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. హ్యాపీగా నగరాన్ని చుట్టేయవచ్చు

వైజాగ్‌లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో ఈ బస్సులు తిరగనున్నాయి. ఆర్‌కే బీచ్, తోట్లకొండ, రుషికొండ, సింహాచలం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లనుంది.

New Update
Double Decker Bus

Double Decker Bus Photograph: (Double Decker Bus)

విశాఖ సాగర తీర అందాలను పర్యాటకులకు చూపించేందుకు డబుల్ డెక్కర్ అద్దాల బస్సు వచ్చేసున్నాయి. ఈ బస్సుల్లో ఓపెన్ టాప్ కూడా ఉంది. ఇందులో కూర్చోని సాగర తీరంలో అందాలను హ్యాపీగా వీక్షించవచ్చు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కువగా విదేశాల్లో ఉంటాయి. వీటిలో ప్రయాణించి ప్రకృతి అందాలను వీక్షించాలని భావిస్తుంటారు.

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలల్లో ..

సాగర తీరంలో మూడు డబుల్ డెక్కర్ బస్సులను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. బీచ్ రోడ్డు, కైలాసగిరి, తొట్లకొండ, భీమిలి బీచ్, ఎర్రమట్టి దిబ్బలు, తెన్నేటి పార్క్ ఇలా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల్లో తిప్పనున్నట్లు టూరిజం అధికారులు చెబుతున్నారు. పర్యాటకుల డిమాండ్‌ను బట్టి వీటిని నగరంలో తిప్పనున్నారు. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

విశాఖపట్నంలోని ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఈ బస్సులను నడపనున్నారు. ఏపీటీడీసీకి చెందిన ఖాళీ స్థలం సాగర్ నగర్‌లో ఉంది. అక్కడ ఈ బస్సులను పార్కింగ్ చేయనున్నారు. ఈ బస్సులో ఆరుగురు డ్రైవర్లు, ఇద్దరు గైడ్లు ఉంటారు. వీరంతా కూడా ఏపీటీడీసీకి చెందినవారే ఉంటారు. వీరికి ప్రత్యేక దుస్తులను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ డబుల్ డెక్కర్ బస్సులను నగరంలో ప్రారంభించనున్నారు.

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

Advertisment
Advertisment
తాజా కథనాలు