AP: ఏపీలో మరో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి!
విశాఖ జిల్లా పరవాడ సెనర్జీస్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో ఫార్మా కార్మికులు, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.