టూవీలర్ వినియోగదారులకు బిగ్ షాక్.. త్వరలో ఛార్జీలు అమలు

దేశంలో ఇప్పటి వరకు టూ వీలర్‌కు ఎలాంటి టోల్ ఛార్జీలు కూడా లేవు. కానీ ఇకపై టూ వీలర్ బైక్‌లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

New Update
Toll Tax Bike

దేశంలో ఇప్పటి వరకు టూ వీలర్‌కు ఎలాంటి టోల్ ఛార్జీలు కూడా లేవు. కానీ ఇకపై టూ వీలర్ బైక్‌లకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది. ఈ టోల్ ఛార్జీలు జూలై 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వం దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బైక్‌లతో  పాటు ఆటోలకు కూడా టోల్ ఛార్జీలు ఉంటాయని తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: Surveyor Tejeshwar Murder: పోలీసుల అదుపులో బ్యాంక్‌ మేనేజర్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇది కూడా చూడండి: Chhattisgarh : మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. నలుగురు కీలక నేతల అరెస్ట్‌

ఏడాది ప్లాన్..

ఇదిలా ఉండగా ఇటీవల కేంద్రం ఫాస్టాగ్ విషయంలో సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ ఏడాదికి ఒకసారి రిచార్జ్‌ చేసుకుంటే యాక్టివేషన్ తేదీ నుంచి ఏడాది వరకు లేదా 200 ట్రిప్పులు వరకు తిరిగే వెసులుబాటు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అంటే రూ.3వేలు పెట్టి ప్లాన్ రిచార్జ్‌ చేసుకుంటే ఏడాది పాటు దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చన్నమాట. 

ఈ విధానాన్ని ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి  అమలు చేస్తున్నట్లుగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. కార్లు,జీప్ లు, వ్యాన్ల వంటి ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఈ కొత్త ప్లాన్ వర్తిస్తుంది. టోల్ ప్లాజా దాటిన ప్రతిసారి ఒకటిగా లెక్కిస్తారు. అలా 200 సార్లు దాటినా లేకా ఏడాది సమయం ముగిస్తే ఆ ప్లాన్‌ అయిపోతుంది. మళ్లీ కావాలని అనుకుంటే రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ పాస్ ధరలో మార్పులు ఉండే అవకాశముంది.

ఇది కూడా చూడండి: Maargan: మొదటి ఆరు నిమిషాలతో భయపెడుతున్న ఆంటోనీ 'మార్గన్'! వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు