Chandrababu : టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక సీఎంకు అందజేయనున్నారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చర్చించనున్నారు.
సీఎం చంద్రబాబుతో టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ కానున్నారు. లడ్డూ వివాదంపై పూర్తి స్థాయి నివేదిక సీఎంకు అందజేయనున్నారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చర్చించనున్నారు.
తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అందులో బీఫ్ టాలో కలిసిందని ల్యాబ్ రిపోర్టులో తేలడం సంచలనం రేపుతోంది. అయితే బీఫ్ టాలో గురించి తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి
మాజీ సీఎం జగన్ తిరుపతి లడ్డూని అపవిత్రం చేశారని మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమలలో చేసిన అక్రమాలపై తప్పులు ఒప్పుకుని స్వామివారి భక్తులకు క్షమాపణలు చెప్పాలన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.
తిరుపతి లడ్డూ కల్తీ మహా పాపమని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. భక్తులు తిరుపతి లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తారన్నారు. ఇలాంటి లడ్డూను కల్తీ చేశారన్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాదంలో కల్తీ ఘటనలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జంతు కొవ్వుతో చేసిన తిరుపతి లడ్డూలను మోదీతోపాటు అయోధ్యకు అందించడంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్ స్వయంగా తన చేతుల మీదుగా అందించడం విశేషం. పవిత్రతను చెడగొట్టారంటూ సత్యేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్కు ట్యాగ్ చేస్తూ సినీ నటుడు ప్రకాష్రాజ్ ట్వీట్ చేశారు. వివాదంపై లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుపతి లడ్డూ వివాదం మీద నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇష్యూ మీద డిప్యూటీ సీఎం పవన్ పెట్టిన పోస్ట్కు రిప్లైగా..ఎందుకు దీనిని జాతీయం చేస్తూ రెచ్చగొడుతున్నారు, వెంటనే చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు ప్రకాశ్ రాజ్.