లడ్డూ వివాదం, లిమిట్స్ లో ఉండండి.. ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్

తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌కు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సమాధానం ఇచ్చారు. దయచేసి ఇలాంటి విషయాల్లో ప్రకాశ్‌ సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు.

New Update
vishnu manchu

Tirupati Laddu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని.. భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. తిరుమల లడ్డూపై ఇప్పుడు నెలకొన్న వివాదం భక్తులను కలవరపెడుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని, జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది. జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది.ఈ క్రమంలోనే  సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. 

ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోట్ చేస్తూ..' మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మనదేశంలో ఇప్పటికే మతాల మధ్య ఉన్న విభేదాలు చాలు' అని పోస్ట్ లో పేర్కొన్నారు. 

మీ పరిధుల్లో మీరు ఉండండి...

తాజాగా ప్రకాష్ రాజ్ పోస్ట్ పై మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.' ప్రకాశ్‌రాజ్‌. దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి, అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. కోట్లాది హిందువుల నమ్మకానికి గుర్తు. 

Also Read : నాని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే, అసలు మతం ఏ రంగు పులుముకుంటోంది ఆలోచించండి. #మీ పరిధుల్లో మీరు ఉండండి' అని రిప్లై ఇచ్చారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు