Dilip Doshi: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత!
భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 FC మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు.