Telanagana: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు
తెలంగాణ సచివాలయంలో ఐటీ మంత్రి పేషీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఐటీ మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ రూ.కోటి 77 లక్షలు తీసుకున్నారు కొందరు దుండగులు. నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు.
Car Accident : ట్యాంక్బండ్పై అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న కారు
హైదరాబాద్ ట్యాంక్బండ్పై ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. సచివాలయం నుంచి ఖైరతాబాద్ వెళ్తుండగా కారు డివైడర్ను ఢీకొంది. కారు వెనుక టైర్లో గాలి తక్కువ ఉండటంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ఎవరూ గాయపడలేదు.
Harish Rao: కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం ఇవే! హరీష్ రావు ట్వీట్ వైరల్
ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సచివాలయం, బుద్ధవనం, యాదగిరిగుట్ట, కమాండ్ కంట్రోల్ సెంటర్ లను సందర్శించారు. ఆ పోటోలను హారిష్రావు ఎక్స్ వేదికగా ‘కేసీఆర్ అద్భుతమైన పాలనకు సజీవ సాక్ష్యం' అని చేసిన ట్వీట్ చేశారు.
Implementation of SC classification : నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు..
తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చట్టం విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి సందర్భంగా జారీ చేసి.. జీఓ మొదటి కాపీ సీఎంకు అందిస్తామన్నారు.
సెక్రటేరియట్లో అడుగడుగున పొంచిఉన్న ప్రమాదం..!
తెలంగాణ సెక్రటేరియట్లో రైలింగ్ పట్టి కూలి 24 గంటలైనా అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై R&B ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సీరియస్ అయ్యారు. శుక్రవారంలోగా బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.
Telangana Secretariat : సచివాలయంలో కూలిన గోడ...తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న బీమ్ నుంచి పెచ్చులు ఊడి కింద పడ్డాయి. పెచ్చులూడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే సచివాలయం పెచ్చులూడిన ప్రాంతంలోనే ఒక కారు ఉండటంతో ఆ కారు ధ్వంసం అయింది.
BIG BREAKING: సెక్రటేరియట్కు బాంబు బెదిరింపులు.. అరెస్టైన వ్యక్తి నుంచి షాకింగ్ విషయాలు
మూడు రోజులుగా ఫోన్ చేస్తూ తెలంగాణ సెక్రటేరియట్లో బాంబు పెట్టామని బెదిరిస్తున్న దుండగుడిని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆగంతకుడి ఆచూకీ తెలుసుకున్నారు. అతను ఫేక్ బెదిరింపు కాల్స్ చేశాడని పోలీసులు తెలిపారు.
Telangana Secretariat : రెవెన్యూ శాఖ ఉద్యోగినని చెప్పి సచివాలయంలోకి వెళ్లి....
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న తెలంగాణ సచివాలయంలో పోలీసుల నిఘా కొరవడింది. సచివాలయంలోకి వచ్చే వారిపై భద్రతా సిబ్బంది సరైన నిఘా పెట్టకపోవడంతో కొంతమంది నకిలీ అధికారులు ఇష్టరీతిన సచివాలయంలోకి చొరపడుతున్నారు. తాజాగా సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు.
/rtv/media/media_files/2026/02/10/fotojet-9-2026-02-10-21-07-01.jpg)
/rtv/media/media_files/2025/02/06/zBkvfpYBt7D6UlMkn5bs.jpg)
/rtv/media/media_files/2025/03/14/ASKC2krLsKcVjceEDNdI.jpg)
/rtv/media/media_files/2025/05/19/Jt9j8wDim6prj95LaMEv.jpg)
/rtv/media/media_files/2025/04/13/RAPPOhvUZ2K9cGdEpnor.jpg)
/rtv/media/media_files/2025/02/04/xdG4cpaxWtztkXRBQVXf.jpg)
/rtv/media/media_files/2025/01/30/o5Ytv10Sc3KqU5CCXEcQ.jpg)