సెక్రటేరియట్‌లో అడుగడుగున పొంచిఉన్న ప్రమాదం..!

తెలంగాణ సెక్రటేరియట్‌లో రైలింగ్ పట్టి కూలి 24 గంటలైనా అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై R&B ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ సీరియస్ అయ్యారు. శుక్రవారంలోగా బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో రిపోర్ట్ ఇవ్వాలని ఇంజనీర్లను ఆయన ఆదేశించారు.

New Update
Telangana Secretariat

Telangana Secretariat Photograph: (Telangana Secretariat)

తెలంగాణ సెక్రటేరియట్‌లో రైలింగ్ పట్టి కూలి 24 గంటలైనా ఘటనపై అధికారులు నివేదిక ఇవ్వకపోవడంపై ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ సీరియస్ అయ్యారు. శుక్రవారంలోగా సచివాలయం బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని బిల్డింగ్ ఇంజనీర్లను ఆయన ఆదేశించారు. బుధవారం సచివాలయంలో పెచ్చులూడి పడిన విషయం తెలిసిందే. సచివాలయం రైలింగ్ పట్టి కూలి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ కారుపై పడి డామేజ్ అయ్యింది. సెక్రటేరియట్‌కు భారీగా పగుళ్లు వచ్చాయని, అడుగడుగునా చీలికలతో ప్రమాదం పొంచి ఉందని రోడ్లు, భవనాల మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. 

Also Read: REVANTH BHIMALA: ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫేం బుల్లి రాజు తండ్రి పోలీస్ కంప్లైంట్.. సంచలన పోస్ట్!

నిర్మాణం చేపట్టిన షాపూర్జి పలోంజి కంపెనీ ప్రతినిధులపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు ప్రతినిధులు ఆయన్ని కలిశారు. సచివాలయం 5వ ఫ్లోర్ నుంచి బుధవారం రాత్రి బిల్డింగ్ శకలాలు ఊడిపడ్డాయి. స్పాట్‌లో ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారుపై పెచ్చులు పడి ధ్వంసమైంది. రూ.1200 కోట్లతో కట్టిన సచివాలయం నాసిరకం అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. 

Also Read :  రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Advertisment
Advertisment
తాజా కథనాలు