Telangana Secretariat : రెవెన్యూ శాఖ ఉద్యోగినని చెప్పి సచివాలయంలోకి వెళ్లి....

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న తెలంగాణ సచివాలయంలో పోలీసుల నిఘా కొరవడింది. సచివాలయంలోకి వచ్చే వారిపై భద్రతా సిబ్బంది సరైన నిఘా పెట్టకపోవడంతో కొంతమంది నకిలీ అధికారులు ఇష్టరీతిన సచివాలయంలోకి చొరపడుతున్నారు. తాజాగా సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు.

New Update
Fake Revenue Officer In Secretariat

Photograph: (Fake Revenue Officer In Secretariat )

 : హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న తెలంగాణ సచివాలయంలో పోలీసుల నిఘా కొరవడింది. భద్రతాలోపం కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. సచివాలయంలోకి వచ్చే వారిపై భద్రతా సిబ్బంది సరైన నిఘా పెట్టకపోవడంతో కొంతమంది నకిలీ అధికారులు ఇష్టరీతిన సచివాలయంలోకి చొరపడుతున్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలకు నిలయమైన సచివాలయానికి రోజు వేలాదిమంది తమతమ పనుల నిమిత్తం వస్తుంటారు. అయితే కొంతమంది ఫేక్‌ అధికారులు సచివాలయానికి వచ్చే అమాయకులను బురిడీ కొట్టించి అందిన కాడికి దోచుకుంటున్నారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులు కాకున్నా నకలీ ఐడీ కార్డులు సృష్టించి యధేచ్ఛంగా సచివాలయంలోకి చొరబడి మంత్రుల పేచిలో తిష్టవేస్తున్నారు. 

సచివాలయంలోకి వచ్చే వారిపై నిఘా పెట్టాల్సిన భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నకిలీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సచివాలయంలో ఒక వ్యక్తి ఫేక్ ఐడీతో దొరికాడు. తను రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సీఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్‌ అధికారులు సదరు వ్యక్తిపై నిఘా పెట్టారు. వారి అనుమానం నిజమే అయింది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్‌రావు అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడీ కార్డుతో చలామణి అవుతున్నట్లు గుర్తించారు. కాగా కాగా సచివాలయ డ్రైవర్‌ రవి భాస్కర్‌ రావుకు సహకరించినట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
కాగా తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (టీజీఎస్పీఎఫ్‌) సచివాలయ భద్రతను పర్యవేక్షిస్తోంది. తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన 214 మంది సిబ్బంది తెలంగాణ సచివాలయం వద్ద భద్రత విధులను నిర్వర్తిస్తున్నారు. సచివాలయం గేట్లు, ఇతర ప్రాంతాల్లో సాయుధ గార్డు, లోపల గస్తీ వంటి బాధ్యతలను ప్రభుత్వం టీజీఎస్పీఎఫ్‌కు అప్పగించింది. మొదట సచివాలయానికి ఎస్పీఎఫ్ భద్రతనే ఉండేది. గత ఏడాది ఏప్రిల్‌లో భద్రత నిర్వహణను తెలంగాణ స్పెషల్ పోలీసులకు అప్పగించారు. అయితే సచివాలయం భద్రతను తిరిగి ఎస్పీఎఫ్‌కే అప్పగించాలని గత ఆగస్ట్ 5న ప్రభుత్వానికి డీజీపీ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఎస్పీఎఫ్ బాధ్యతలను స్వీకరించింది. అయితే సచివాలయానికి మరింత భద్రత పెంచాలని పలువురు కోరుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు