శ్రీశైలం ప్రాజెక్ట్ కు భారీగా వరద
TG: శ్రీశైలం పవర్ హౌస్లో భారీ పేలుడు జరిగింది. పేలుడు ధాటికి ఏడో నంబర్ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎగువ ప్రాంతాల నుంచి గంట గంటకు కృష్ణా వరద ప్రవాహం పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండు కుండలా మారింది. దీంతో మంగళవారం రాత్రి తొమ్మిది గంటల సమయానికి శ్రీశైలం పది గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగువ సాగర్కు 2,75,700 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు.