/rtv/media/media_files/2025/07/12/srisailam-2025-07-12-15-16-24.jpg)
వీకెండ్ కావడంతో పర్యటలకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు బారులుతీరారు. దీంతో శ్రీశైలం జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గతకొన్ని రోజుల క్రితం శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తడంతో చూసేందుకు పర్యాటకులు భారీగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అమ్రాబాద్ మండలం పాతాళగంగ నుంచి దోమలపెంట చెక్ పోస్టువరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్
— greatandhra (@greatandhranews) July 12, 2025
శని, ఆదివారం తో పాటు శ్రీశైలం డామ్ గేట్లు తెరవడంతో శ్రీశైలంకు భక్తుల తాకిడి పెరిగింది
దీంతో 4-5 కి.మీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.#Srisailam#SrisailamDampic.twitter.com/0Nh5zhUQh0
హైవేపై 10 కి.మీ మేర వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైతే ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.