బాహుబలి మళ్ళీ రాబోతున్నాడ..? | Bahubali | Re Release | 10 years for Bahubali | Prabhas | RTV
పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించినప్పటికీ, నేపథ్య సంగీతం కోసం ఇతర సంగీత దర్శకులను తీసుకురావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో దేవి శ్రీ తన ఆవేదన, ఆగ్రహాన్ని వేదిక పైనే వెల్లడించారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భార్య కన్నుమూశారు. బుధవారం నాడు వరలక్ష్మి మృతి చెందినట్లు సమాచారం.సోదరి అనారోగ్యంతో బాధపడుతుండడంతో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. తనను కిడ్నాప్ చేసి, తన కంపెనీ షేర్లు బదాలియించుకున్నారంటూ క్రియా హెల్త్కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు చేయగా 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బేబీ చిత్రంతో పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్కేఎన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి గాదె సూర్య ప్రకాశరావు గురువారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
క్యూట్ నవ్వు...బ్యూటిఫుల్ ఫిగర్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత ఏడాది పాటూ సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది. అయితే ఇది కేవలం నటనకు మాత్రమే పరిమితం చేసింది సామ్. ఈ బ్యూటీ ఇప్పుడు మరో కొత్త అవతారంతో ఎంట్రీ ఇస్తోంది.