Phone Tapping Case : ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో టాలీవుడ్(Tollywood) కు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) అధినేత నవీన్ యర్నేని(Naveen Yerneni) హస్తం ఉన్నట్లు ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ మేరకు అక్రమ ఫోన్ ట్యాపింగ్, వ్యాపారుల పట్ల బెదిరింపు వసూళ్లు ఆరోపణలపై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పి.రాధాకిషన్రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్పై జూబ్లీహిల్స్ ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా నిందితుల జాబితాలో నవీన్ ఉన్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఫోన్ ట్యాపింగ్, కిడ్నాప్ కేసులో పుష్ప2 నిర్మాత.. 34 సెక్షన్ల కింద కేసు నమోదు!
ఫోన్ ట్యాపింగ్ కేసులో సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని హస్తం ఉన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. తనను కిడ్నాప్ చేసి, తన కంపెనీ షేర్లు బదాలియించుకున్నారంటూ క్రియా హెల్త్కేర్ డైరెక్టర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఫిర్యాదు చేయగా 34సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Translate this News: