Buneti Chanakya: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. ఫిల్మ్ ఇండస్ట్రీతో A-8 చాణక్యకు ఉన్న లింకులేంటి?

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A8 బూనేటి చాణక్య 2 తెలుగు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. దీంతో ఈకేసులో టాలీవుడ్ ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్‌ బ్లాక్ మనీతో చాణక్య సినిమాలు తీశాడా అని అనుమానం వ్యక్తమతుంది.

author-image
By K Mohan
New Update
AP Liquor Scam New

ఏపీ లిక్కర్ స్కామ్‌లో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో A8గా ఉన్న చాణక్య గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. బూనేటి చాణక్య అలియాస్‌ ప్రకాశ్‌ను ఏప్రిల్‌లో సిట్‌ అదుపులోకి తీసుకుంది. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రూపొందించిన నెట్‌వర్క్‌ నిర్వహణలో రాజ్‌ కెసిరెడ్డి ప్రతినిధిగా బూనేటి చాణక్య కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు చాణక్య సినీ ప్రముఖులతో సంబంధాల అంశం హాట్ టాపిక్ గా మారింది.

Also Read :  ఎవరీ కేరళా కుట్టి.. 19 ఏళ్లకే ఇన్ని కళలా!

లిక్కర్ స్కామ్‌లో సినీ ప్రముఖులు

ఈ చాణక్యకు సినీ రంగంలో పెట్టుపబడులు పెట్టినట్లు తెలిసింది. లిక్కర్ స్కాం నిందితుడు చాణక్య తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు ప్రవీణ్ సత్తార్‌కు దగ్గర బంధువు. చాణక్య కూడా రెండు సినిమాలకు ప్రొడక్షన్ వహించారు. ప్రవీణ్ సత్తార్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి సినిమాల పట్ల ఆసక్తితో దర్శకుడుగా మారాడు. తన మొదటి సినిమా ఎల్ బి డబ్ల్యు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన రెండవ సినిమా రొటీన్ లవ్ స్టోరీ, మూడవ సినిమా చందమామ కథలకు కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతమంది నటీనటులతో కూడా చాణక్యకి పరిచయాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సిట్ అధికారులు.. చాణక్యతో సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా లింక్స్ ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్‌లోని డబ్బులతో ఇండస్ట్రీలో ఏమైనా పెట్టుబడులు పెట్టారా? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక టాలీవుడ్‌లో కొందరు హీరో, హీరోయిన్లు, డైరెక్టర్లు కూడా బూనేటి చాణక్యకు తెలుసు అని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే లిక్కర్ స్కామ్‌లో వచ్చిన బ్లాక్ మనీతోనే చాణక్య నిర్మాతగా మారాడా అనే విషయాలపై సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. హీరో నితిన్‌తో చాణక్య దిగిన ఫోటో వైరల్‌గా మారింది. మూవీ యూనిట్‌లో పని చేసిన వారితో కూడా అతనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. దీంతో విచారణ పూర్తయితే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Also Read :  తమ్ముడి అంత్యక్రియల్లో మృత్యుంజయుడు రమేష్

కుట్రలో చాణక్య పాత్ర కీలకం

రాజ్‌ కెసిరెడ్డి ఆదేశాల మేరకు కొన్నాళ్ల కిందటే ప్రకాశ్‌ దుబాయ్‌కు పారిపోయారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతమవటం, సిట్‌ అన్ని వైపుల నుంచీ ఉచ్చు బిగించటంతో తప్పించుకునే మార్గం లేక ఏప్రిల్‌లో భారత్‌కు తిరిగొచ్చారు. ఆ వెంటనే సిట్‌ ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించింది. ముడుపులు ఎలా వసూలు చేశారు, వాటిని రాజ్‌ కెసిరెడ్డికి ఎలా చేర్చారనేదానిపై ప్రశ్నించి కీలక సమాచారం రాబట్టింది. ఈ కుట్రలో చాణక్య పాత్ర కీలకమేనని తేలటంతో అరెస్టు చేయాలని నిర్ణయించారు. 

ప్రకాశ్‌ ద్వారానే ఇండెంట్‌ ప్రణాళిక

మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలు చెల్లించే ముడుపుల ఆధారంగా ఏయే బ్రాండ్లకు ఎక్కువగా ఇండెంట్లు పెట్టాలి? వేటికి తక్కువ ఇండెంట్లు పెట్టాలి? ఏయే బ్రాండ్లకు అసలు ఇండెంట్లే పెట్టొద్దు అనేది రాజ్‌ కెసిరెడ్డి నిర్ణయించేవారు. దాని ఆధారంగా ముసాయిదా ఇండెంట్‌ ప్రణాళికను రూపొందించి.. ప్రకాశ్‌ ద్వారా ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రత్యేకాధికారి సత్యప్రసాద్‌కు పంపించేవారు. సత్యప్రసాద్‌ దాని ఆధారంగానే.. ఎంత ఇండెంట్లు పెట్టాలో డిపో మేనేజర్లను ఆదేశించేవారు. ఎంతమేర ముడుపులు చెల్లించాలనేదానిపై హైదరాబాద్‌ పరిధిలోని మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీలతో ప్రకాశే సంప్రదింపులు జరిపేవారు. మద్యం విక్రయాల డేటాను అనూష అనే అసిస్టెంట్‌ ద్వారా రాజ్‌ కెసిరెడ్డి ఎప్పటికప్పుడు తెప్పించుకునేవారు. ఆ సమాచారాన్ని ప్రకాశ్‌కు చేరవేస్తే.. దాని ఆధారంగా ఆయన ఆ కంపెనీల నుంచి ఐదురోజులకోసారి ముడుపులు వసూలు చేసేవారు.  

ముడుపుల వసూళ్ల ప్రక్రియ తొలుత రాజ్‌ కెసిరెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాష్‌రెడ్డి పర్యవేక్షించేవారు. తర్వాత ఆయన్ను తప్పించి ప్రకాశ్‌కు అప్పగించారు. ప్రకాశ్, అతని అనుచరగణం.. దర్యాప్తు సంస్థలకు దొరక్కుండా డిస్టిలరీలు, సరఫరాదారులతో వీపీఎన్, ఇంటర్నేషనల్‌ ఫోన్‌ నంబర్లతో మాట్లాడేవారు. ముంబయి, దిల్లీల్లోని హవాలా నెట్‌వర్క్‌లు, డొల్ల కంపెనీలు, స్థిరాస్తి సంస్థలు, బంగారం దుకాణాలు, ఇతర కంపెనీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము మళ్లించి.. అక్కడి నుంచి వాటిని తీసుకుని, రాజ్‌ కెసిరెడ్డికి చేరవేయటంలో ప్రకాశ్‌దే ప్రధాన పాత్ర.

లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరంటే?

ఈ కేసులో ప్రధాన సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, కె.ధనుంజయ్‌రెడ్డి, పైలా దిలీప్‌, చాణక్యలను విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. వారికి జూలై ఒకటో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించారు. కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దిలీప్‌, చాణక్య బెయిల్‌ పిటిషన్లపై విచారణను 19కి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణను 20కి, బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్‌ను 23వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. 

Also Read :  తగ్గేదే లే.. రక్తానికి రక్తమే సమాధానం.. ఇరాన్ సంచలన వార్నింగ్

 

Also Read :  పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మరో బాంబు పేలుడు

 

tollywood | producer | latest-telugu-news | ap liquor scam | raj kasireddy arrest | raj kasireddy arrest by sit police | ap liquor scam latest news | ap liquor scam updates | Buneti Chanakya

Advertisment