కొత్త పార్టీకి నేను నాయకుడ్ని కాదు.. ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అక్టోబర్ 2న కొత్త పార్టీని ప్రారంభించనున్నారు. ఈ పార్టీకి తానెప్పుడు నాయకుడిని కాదని.. అలా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదని అన్నారు. ప్రజలే నాయకత్వ బాధ్యతలు స్వీకరించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.